బెంగళూరు: సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానులకు శుభవార్త. ఆ జట్టు రెగ్యులర్ సారథి పాట్ కమిన్స్ బుధవారం బెంగళూరులో టీమ్తో కలిశాడు. యాషెస్ తర్వాత వెన్ను గాయంతో గత కొద్దినెలలుగా ఆటకు దూరమైన అతడు.. ఐపీఎల్-19లో ఆరంభ మ్యాచ్లకు దూరమైనా టోర్నీ అర్ధభాగానికంటే ముందే మ్యాచ్లకు సిద్ధమవుతాడని తెలుస్తున్నది.
బుధవారం అతడు బెంగళూరులో తేలికపాటి కసరత్తులతో పాటు ఫీల్డింగ్ డ్రిల్స్, బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అన్నీ కుదిరితే మూడు, నాలుగు మ్యాచ్ల (హైదరాబాద్ ఆడేవి) తర్వాత అతడు బరిలోకి దిగే అవకాశమున్నట్టు సమాచారం.