బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో యువ షట్లర్ లక్ష్యసేన్ 21-8, 22-20తో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)పై అలవోక విజయం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనలిస్టు అయిన కార్డన్పై లక్ష్యసేన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆది నుంచే జోరు కనబరుస్తూ వరుస గేముల్లో కార్డన్ను చిత్తుచేశాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడీ 21-17, 21-14తో ఫ్రాన్స్ ద్వయం కార్వీ, లాబర్పై అలవోక గెలిచి ముం దంజ వేశారు. మహిళల డబుల్స్లో అశ్విని, తనీషా జోడీ పోరాటం ము గిసింది.