న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం మండోలీ జైలులో ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు భద్రత పెంచారు. సుశీల్కు ప్రాణహాణి ఉందనే అనుమానంతో అదే జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను తీహార్ జైలుకు తరలించారు. దీంతో పాటు సుశీల్కు అదనపు భద్రత కల్పించేందుకు పారామిలటరీ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.