కౌలాలంపూర్ : భారత ప్రముఖ బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ తన కెరీర్లో 25వ ప్రపంచ టైటిల్ను గెలుచుకున్నాడు. శనివారం కౌలాలంపూర్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్లో పంకజ్ 4-0 తేడాతో స్వదేశానికే చెందిన సౌరవ్ కొఠారిని ఓడించి విజేతగా నిలిచాడు. ఒకే ఏడాది జాతీయ, ఆసియా, ప్రపంచ టైటిల్స్ గెలవడం పంకజ్కిది అయిదోసారి. అంతేగాక ఈ టైటిల్ను గెలవడం కూడా వరుసగా అయిదోసారి.