దుబాయ్:టీ20 వరల్డ్కప్ రెండవ సెమీస్లో ఇవాళ ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనున్నది. అయితే పాక్ బ్యాటర్లు షోయెబ్ మాలిక్, రిజ్వాన్లు ఈ మ్యాచ్లో ఆడేది డౌట్గా కనిపిస్తోంది. ఆ ఇద్దరూ స్వల్పంగా ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. బుధవారం ఇద్దరూ ట్రైనింగ్ సెషన్కు హాజరుకాలేదు. అయితే ఇద్దరికీ కోవిడ్ పరీక్షలు చేయగా.. వాళ్లు నెగటివ్ తేలారు. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో ఐసీసీ నియమావళి ప్రకారం కూడా ఆటగాళ్లకు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ఆ పరీక్షల్లోనూ ఇద్దరూ నెగటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం ఇద్దరికీ స్వల్పంగా ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి, ఇద్దరూ స్వల్ప స్థాయి జ్వరంతో బాధపడ్డారు. మాలిక్, రిజ్వాన్లు ఈ టోర్నీలో కీలక పాత్ర పోషించారు.