వచ్చేసింది.. ఆ సమయం వచ్చేసింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా 16వ మ్యాచ్ కొద్దిసేపట్లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగనుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా బ్యాటింగ్కు సిద్ధమవుతోంది.
టీమిండియా ప్లేయర్లలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యాదవ్, పంత్, పాండ్యా, జడెజా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, షమీ, బుమ్రా.. పాకిస్థాన్తో మ్యాచ్ ఆడనున్నారు.
పాకిస్థాన్ ప్లేయర్లలో బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, జమాన్, హఫీజ్, మాలిక్, ఏ అలీ, ఎస్ ఖాన్, వాసిమ్, హెచ్ అలీ, హెచ్ రౌఫ్, ఎస్ అఫ్రిదీ ఈ మ్యాచ్ ఆడనున్నారు.