Team India – Pakistan : చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తొలిసారి టెస్టు ర్యాకింగ్స్(Test Rankings)లో నిలిచాయి. శ్రీలంకపై గాలే టెస్టు(Galle Test)లో భారీ విజయం సాధించిన పాక్, 12 పాయిట్లతో టీమిండియా సరసన చేరింది. వెస్టిండీస్(Westindies)పై తొలి టెస్టు నెగ్గిన భారత్ టెస్టు చాంపియన్షిప్ ర్యాకింగ్స్లో నంబర్ 1 ఆస్ట్రేలియా(Australia)ను వెనక్కి నెట్టిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ కూడా వంద శాతం విజయాలతో భారత్తో సంయుక్తంగా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
అయితే. యాషెస్ సిరీస్(Ashes Series)ను 3-2 లేదా 4-1తో ఆసీస్ దక్కించుకుంటే టీమిండియా సహా పాక్ అగ్రస్థానం కోల్పోయే అవకాశం ఉంది. అప్పుడు భారత్ 2-0, 1-1 లేదా 1-0తో వెస్టిండీస్పై సిరీస్ గెలిచినా లాభం లేదు. అలాగే పాక్ జట్టు 2-0తో శ్రీలంకను చిత్తు చేసినా లేదా 1-1తో సిరీస్ సమం అయినా, 1-0తో సిరీస్ గెలిచినా కూడా ప్రయోజనం ఉండదు.
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో పాకిస్థాన్ తొలి టెస్టులోనే సంచలన విజయం నమోదు చేసింది. గాలే వేదికగా జరిగిన మ్యాచ్లో ఆతిథ్య లంకపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సౌద్ షకీల్(208) డబుల్ సెంచరీతో పాక్కు భారీ స్కోర్ అందించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో లంక 279కే కుప్పకూలింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 6 వికెట్ల నష్టానికి ఛేదించింది. రెండో ఇన్నింగ్స్లోనూ షకీల్ 30 పరుగులతో రాణించాడు. దాంతో రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
సౌద్ షకీల్(208)
ఈ ఏడాది కూడా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) చేరిన టీమిండియా టెస్టు గదను అందుకోలేకపోయింది. ఓవల్ స్టేడియం(Oval Stadium)లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. డబ్ల్యూటీసీ ఓటమితో తీవ్ర విమర్శల పాలైంది. ఆ వెంటనే విండీస్ పర్యటనకు వచ్చిన భారత జట్టు అదరగొట్టింది.
యశస్వీ జైస్వాల్(171)
తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(171) ఆరంగేట్రం మ్యాచ్లోనే శతకంతో సత్తా చాటాటు. కెప్టెన్ రోహిత్ శర్మ(108) సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ విండీస్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్లో కరీబియన్ల పని పట్టిన రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్లోనూ 7 వికెట్లతో విజృంభించాడు. దాంతో, భారత్ భారీ విజయంతో డబ్ల్యూటీసీ ర్యాకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.