షార్జా: అఫ్గానిస్థాన్తో సోమవారం జరిగిన మూడో టి20లో పాకిస్థాన్ 66 పరుగుల తేడాతో గెలిచి ప్రత్యర్థి సిరీస్ క్లీన్స్వీప్ చేయకుండా అడ్డుకుంది. తొలుత పాకిస్థాన్ 7 వికెట్లకు 182 (సయీమ్ అయూబ్ 49, ఇఫ్తికార్ అహ్మద్ 31, కెప్టెన్ షాదాబ్ ఖాన్ 28, షఫీక్ 23, ముజీబ్ 2/28) పరుగులు చేయగా, సమాధానంగా అఫ్గానిస్థాన్ 18.4 ఓవర్లలో 116 (అజ్మతుల్లా ఒమర్జాయ్ 21, రహమానుల్లా గుర్బాజ్ 18, మొహమ్మద్ నబి 17, రషీద్ ఖాన్ 16, ఉస్మాన్ ఘని 15, ఇసానుల్లా 3/29, షాదాబ్ఖాన్ 3/13) పరుగులకే ఆలౌటయింది. షాదాబ్ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, మొహమ్మద్ నబికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.