కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు చెందిన మీడియా మేనేజర్ ఉమర్ ఫారూక్ కల్సన్తో పాటు పీసీబీ బోర్డుకు చెందిన జనరల్ మేనేజర్ అద్నన్ అలీ వివాదంలో ఇరుక్కున్నారు. ఆ ఇద్దరూ కొలంబోలో క్యాసినోకు వెళ్లినట్లు ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆసియాకప్(Asia Cup)లో ఆడుతున్న పాక్ జట్టు తరపున ఉమర్ ఫారూక్ ఆ దేశ మీడియా మేనేజర్గా ఉన్నారు. అధికారిక హోదాలో లంకలో టూర్ చేస్తున్న ఇద్దరూ .. క్యాసినోకు వెళ్లడం వివాదాస్పదమైంది. గ్యాంబ్లింగ్ డెన్లో ఉన్న ఆ ఇద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి ప్రకారం .. క్యాసినో నిషేధిత ప్రదేశమని, ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.
పీసీబీ అధికారులు ఎందుకు ఇంత అపరిపక్వంగా, అజాగ్రత్తగా వ్యవహరించారని పాక్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పీసీబీకి చెందిన సుమారు 20 మంది అధికారులు.. కొలంబోకు వస్తూ వెళ్తున్నారని, కొందరైతే పర్మనెంట్గా అక్కడే ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం డిన్నర్ కోసమే తాము క్యాసినోకు వెళ్లినట్లు ఆ ఇద్దరూ పాక్ మీడియాకు వెల్లడించారు. ఎవరైనా తినేందుకు క్యాసినో వెళ్తారా? ఫుడ్ కోసం గ్యాంబ్లింగ్ ప్లేసకు వెళ్తారా? ఎవర్ని ఫూల్ చేస్తున్నారని ఓ పాక్ అభిమాని మండిపడ్డాడు.
PCB media officials Umer Farooq Kalson and Adnan Ali having a good time in a casino in Colombo. Cricket fans will recall that Chief Selector/Manager Moin Khan was recalled during World Cup 2015 and sacked by PCB Chairman Sheharyar Khan when he was seen in a casino in Christchurch… pic.twitter.com/eRoF534xD1
— Shakil Shaikh (@shakilsh58) September 9, 2023