Zahid Mohammad : పాకిస్థాన్ బౌలర్ జహిద్ మొహమ్మద్ ఆరంగ్రేటం మ్యాచ్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రావల్పిండిలో ఇంగ్లండ్తో జరగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఈ లెగ్ స్పిన్నర్ 235 రన్స్ ఇచ్చాడు. దాంతో, ఆరంగ్రేటం మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్గా అతను ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక బౌలర్ సూరజ్ రన్దీవ్ పేరు మీద ఉంది. అతను టీమిండియాతో 2010లో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్లో 222 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో జహిద్ 33 ఓవర్లు వేసి, నాలుగు వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్లో బెన్ స్టోక్స్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ జట్టు అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఏకంగా నలుగురు ఆటగాళ్లు సెంచరీలు బాదారు. దాంతో, రెండో రోజు ఆ జట్టు 657 పరుగులకు ఆలౌట్ అయింది. టెస్టుల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోర్. సెంచరీ హీరో హ్యారీ బ్రూక్ 153 పరుగులు చేశాడు. ఇప్పటికే ఈ టెస్టులో ఇంగ్లండ్ రెండు వరల్డ్ రికార్డులు బద్ధలు కొట్టింది. తొలి సెషన్లో 174 రన్స్, ఒకే రోజు 506 పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. పాక్ బౌలర్లలో నసీం షా 3 వికెట్లు, మొహమ్మద్ అలీ రెండు, హ్యారిస్ రౌఫ్ ఒక వికెట్ పడగొట్టారు.