ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) కఠిన చర్య తీసుకున్నది. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్ జట్టు సూపర్ 8 స్టేజ్లోనే వైదొలిగిన విషయం తెలిసిందే. సెమీస్కు చేరకపోవడం పట్ల ఆ దేశ క్రికెట్ బోర్డు ఆగ్రహంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు జరిమానా విధించింది. భారీగా ఫైన్ వేసింది. కీలక ప్లేయర్లపై ఒక్కొక్కరికి సుమారు 5 మిలియన్ల పాకిస్థాన్ రూపాయల జరిమానా విధించింది. అంటే ఒక్కో ప్లేయర్ సుమారు 17 లక్షలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
టోర్నీలో ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయని క్రికెటర్లకు ఈశిక్ష పడినట్లు తెలుస్తోంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, పేస్ బౌలర్ షహీన్ అఫ్రీది, ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్పైన కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జరిమానా విధించింది. తొలి రౌండ్లో ఇండియాతో జరిగిన మ్యాచ్లో సరైన ఆటతీరును ప్రదర్శించని క్రికెటర్లకు ఈ జరిమానా వేసినట్లు తెలుస్తోంది. చెత్త పర్ఫార్మెన్స్ను ఏమాత్రం సహించేది లేదని పీసీబీ వెల్లడించింది. భవిష్యత్తులో మెరుగైన ఆటను ప్రదర్శించిన క్రికెటర్లకు మాత్రమే ప్రోత్సాహకాలు ఉంటాయని పీసీబీ చెప్పింది.