ఇస్లాబాద్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజాను ప్రభుత్వం తొలగించింది. రమీజ్ స్థానంలో నజామ్ సేథీకి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు పీసీబీ చైర్మన్ పేరును పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆమోదించారు. ఇంగ్లండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో పాక్ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత రమీజ్పై వేటుపడనుందనే చర్చ జరిగింది. ఇంగ్లండ్ సిరీస్ సమయంలోనే మాజీ బోర్డు సభ్యుల నేతృత్వంలోని బృందం రమీజ్ను చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా పీసీబీలో మార్పుల కోసం న్యాయశాఖ సైతం ప్రధానికి విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా.. రమీజ్రాజాను మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీసీబీ బోర్డు చైర్మన్గా నియమించారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ భారీ మెజారిటీ సాధించడంతో నజామ్ సేథీ పీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పీసీబీ బోర్డు రాజ్యాంగం ప్రకారం.. చైర్మన్ పదవికి అభ్యర్థులను నామినేట్ చేసేది ప్రధానమంత్రే. ఆ తర్వాత ‘బోర్డ్ ఆఫ్ గవర్నర్స్’ అందులో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటుంది. రమీజ్ రాజా 2021లో పీసీబీ చైర్మన్గా నియామకమయ్యారు. ఇమ్రాన్ పదవీచ్యూతుడయ్యాక రమీజ్ పదవీగి గండం పొంచి ఉందని వార్తలు వచ్చాయి. షాబాద్ ప్రధాని అయ్యాక చాలా రోజుల పాటు రమీజ్ పీబీసీ చైర్మన్గా కొనసాగాడు. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో జట్టు పేలవమైన ప్రదర్శన, అనేక ఆరోపణలు, వివాదాల తర్వాత రమీజ్ పదవీ కోల్పోవాల్సి వచ్చింది.