లాహోర్ : ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో పాక్ 4 వికెట్ల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించి 2-1తో సిరీస్ దక్కించుకుంది. ఆసీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని పాక్ 41.5 ఓవర్లలో 161-6 స్కోరు చేసింది. బాబర్ ఆజమ్(40), షాదాబ్ఖాన్(29 నాటౌట్), మాజ్ సదాఖత్(27) రాణించారు.
మాథ్యూ కున్హెమన్(3-38) మూడు వికెట్లు తీశాడు. తొలుత షాహిన్ షా ఆఫ్రిది(3-30), అబ్రార్ అహ్మద్(2-19), షాదాబ్ఖాన్(2-28) ధాటికి ఆసీస్ 42 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. పాక్ స్పిన్నర్ల ధాటికి ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ జోష్ ఇంగ్లిస్(65) మినహా మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు.