సూపర్ ఫామ్లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
పేరిట ఉన్న పలు రికార్డులను ఇప్పటికే బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అజామ్ మరో రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 2వేల పరుగుల మార్క్ను చేరుకున్న బ్యాట్స్మన్గా బాబర్ నిలిచాడు. ఈ క్రమంలోనే కోహ్లీ పేరిట ఉన్న రికార్డును పాక్ సారథి అధిగమించాడు.
అజామ్ కేవలం 52 ఇన్నింగ్స్ల్లోనే 2వేల మైలురాయిని చేరుకున్నాడు. జింబాబ్వేతో చివరిదైన మూడో టీ20లో బాబర్ 52 రన్స్ సాధించడం ద్వారా ఈ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 11వ బ్యాట్స్మన్గా బాబర్ నిలిచాడు. పాకిస్థాన్ తరఫున ఈ ఫీట్ సాధించిన మూడో క్రికెటర్. బాబర్ కన్నా ముందు మహ్మద్ హఫీజ్(2388), షోయబ్ మాలిక్(2335) 2వేల పరుగుల మార్క్ అధిగమించారు.
బాబర్ అజామ్- 52 ఇన్నింగ్స్లు
విరాట్ కోహ్లీ- 56 ఇన్నింగ్స్లు
అరోన్ ఫించ్-62 ఇన్నింగ్స్లు
మెక్కల్లమ్-66 ఇన్నింగ్స్లు
మార్టిన్ గప్తిల్-68 ఇన్నింగ్స్లు