కొలంబో: ఎమర్జింగ్ ఆసియాకప్లో యువ భారత్కు భంగపాటు ఎదురైంది.ఆదివారం జరిగిన తుదిపోరులో భారత్ 128 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. పాక్ నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 40 ఓవర్లలో 224 పరుగులకు కుప్పకూలింది.
అభిషేక్శర్మ(61)మినహా అందరూ విఫలమయ్యారు. సూఫియాన్ (3/66) మూడు వికెట్లు దక్కాయి. తొలుత తయ్యబ్ తాహిర్ (108), ఫర్హాన్(65), ఆయూబ్ (59) రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 352/8 భారీ స్కోరు చేసింది. నిశాంత్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.