ఇస్లామాబాద్: పాకిస్థాన్ నటి సేహర్ షిన్వారి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆదివారం భారత్, జింబాబ్వే మధ్య జరగనున్న మ్యాచ్ను ఉద్దేశించి షిన్వారి ఓ ట్వీట్ చేసింది. ఒకవేళ ఆ మ్యాచ్లో ఇండియాను జింబాబ్వే ఓడిస్తే, అప్పుడు ఆ దేశ వ్యక్తిని పెళ్లి చేసుకోనున్నట్లు ఆమె తన ట్వీట్లో వెల్లడించింది. ఇండియా, బంగ్లా మ్యాచ్ సమయంలో షిన్వారి వరుసగా ట్వీట్లు చేసింది. ఇండియా ఓడిపోవాలని ఆమె కోరుకున్నది. కానీ బంగ్లా ఓడిపోవడంతో.. పాక్కు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి.
I'll marry a Zimbabwean guy, if their team miraculously beats India in next match 🙂
— Sehar Shinwari (@SeharShinwari) November 3, 2022
ఇప్పటికే బంగ్లా చేతిలో ఓడిన పాక్.. సెమీస్కు వెళ్లడం కష్టంగా మారుతోంది. అయితే ఆదివారం భారత్తో జరగనున్న మ్యాచ్లో జింబాబ్వే గెలవాలని షిన్వారి తన ట్వీట్లో తెలిపింది. ఇండియాను ఓడిస్తే జింబాబ్వే వ్యక్తిని పెళ్లి చేసుకోనున్నట్లు షిన్వారి తన ట్వీట్లో పేర్కొన్నది. ఆ పోస్టుకు 850 మంది యూజర్లు లైక్ చేశారు. 49 మంది రీట్వీట్ చేశారు.