PAK vs NZ: సుదీర్ఘకాలం తర్వాత ఇండియాకు వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చిన పాకిస్తాన్ జట్టుకు భారత ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ భద్రత వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నాడు ఆ జట్టు పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మికీ ఆర్థర్. చెన్నై వేదికగా పాకిస్తాన్ – ఆస్ట్రేలియా మ్యాచ్కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆర్థర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకు కోవిడ్ సమయంలో బయో బబుల్లో ఆడినట్టు ఉందని వాపోయాడు.
ఆర్థర్ మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీలో అత్యంత కఠినమైన విషయమేంటంటే మా సెక్యూరిటీ. వాస్తవంగా చెప్పాలంటే దీనిని చూస్తుంటే మాకు కోవిడ్ నాటి రోజులు గుర్తొస్తున్నాయి. పక్క గదికి వెళ్లాలన్నా.. బయటకు పోవాలన్నా టైట్ సెక్యూరిటీ ఉంది. బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్కరికి ఒక్కో రూమ్లో, టీమ్ మీటింగ్ మరో రూమ్ వంటివి ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి..’ అని చెప్పాడు. తమ ఆటగాళ్లు బయటకు వెళ్లి తినేందుకు గానీ సమయం గడిపేందుకు గానీ అవకాశం లేకుండా ఉందని ఆర్థర్ వాపోయాడు.
Mickey Arthur figures out big problem for Pakistan in India — “Cricket has not been challenging for Pakistan but the massive amount of security has made it tough for Pakistan in this WorldCup. I found it difficult myself aswell. It looked as if we are back in covid times.” #cwc23 pic.twitter.com/raREnEzqXV
— Arfa Feroz Zake (@ArfaSays_) November 3, 2023
కాగా వరల్డ్ కప్లో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే శనివారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఏడుమ్యాచ్లు ఆడి నాలుగు గెలిచి మూడింటిలో ఓడిన పాకిస్తాన్.. కివీస్తో గెలిచినా అఫ్గానిస్తాన్ జట్టు ఫలితాలపై ఆ జట్టు సెమీస్ ఆశలు ఆధారపడి ఉంటాయి.