T20 World Cup : పొట్టి ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. సెమీఫైనల్ బెర్తుపై కన్నేసిన పాక్ భారీ తేడాతో శ్రీలంకను ఓడించలేకపోయింది. ఓపెనర్ ఫర్హాన్(100) సెంచరీతో పల్లెకెలె స్టేడియంలోభారీ స్కోర్ చేసినా.. బౌలర్లు శ్రీలంకను 147లోపు కట్టడి చేయలేకపోయారు. స్పిన్నర్లు చెలరేగినా.. పవన్ రత్ననాయకే(58) అర్ధశతకంతో విరుచుకుపడి పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు.
నాకౌట్ తొలి మ్యాచ్ వర్షార్పణం కావడం.. ఆపై ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్ జట్టుసెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేశాయి. ఇక ఇంటిదారి పట్టడం పక్కా అనుకున్న వేళ.. న్యూజిలాండ్ అనూహ్యంగా పరాజయం పాలవ్వడం పాక్కు కలిసొచ్చింది. శ్రీలంకపై భారీ తేడాతో గెలిస్తే సెమీస్ చేరడం ఖాయమనిపించింది.
Knocked out in the group stage in 2024, New Zealand make it right immediately after ✅ pic.twitter.com/53uh25NAOV
— ESPNcricinfo (@ESPNcricinfo) February 28, 2026
కానీ, 212 రన్స్ కొట్టినా పాకిస్థాన్ బంతితో మాత్రం శ్రీలంకను పడగొట్టలేకపోయింది. మైనస్ రన్ రేటులో ఉండడంతో లంకను 147లోపే కట్టడి చేస్తేనే పాక్ సెమీస్ దూసుకెళ్లే పరిస్థితి. ఆరంభంలోనే నసీం షా డేంజరస్ పథుమ్ నిశాంక వికెట్ తీసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత అబ్రార్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగాడు. అంతే.. పాక్ ఆటగాళ్లు ముఖాల్లో ఆనందం విరిసింది. కానీ, పవన్ రత్ననాయకే(58), కెప్టెన్ దసున్ శనకతో కీలక భాగస్వామ్యం నెలకొల్పి.. పాక్ ఆశలను గల్లంతు చేశాడు. లంక స్కోర్ 148 దాటడమే ఆలస్యం.. పాక్ ఇంటిదారి పట్టింది.