హరారే: టాపార్డర్ బ్యాట్స్మన్ అజహర్ అలీ (126), ఆబిద్ అలీ (118 బ్యాటింగ్) సెంచరీలతో కదం తొక్కడంతో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఇమ్రాన్ భట్ (2), కెప్టెన్ బాబర్ ఆజమ్ (2), ఫవద్ ఆలమ్ (5) విఫలం కాగా.. ఆబిద్తో పాటు సాజిద్ ఖాన్ (1) క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 3 వికెట్లు పడగొట్టాడు.