ODI World Cup 2023 : వరల్డ్ నంబర్ 1గా ఆసియా కప్(Asia Cup 2023)లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు(Pakistan Team) అనూహ్యంగా సూపర్ 4లోనే ఇంటిదారి పట్టింది. దాంతో, భారత్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)పై బాబర్ సేన భారీ ఆశలే పెట్టుకుంది. అయితే.. పాక్ క్రికెటర్లు ఈ మెగా టోర్నమెంట్ ప్రమోషన్స్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. స్పాన్సర్ల లోగోలు(Sponsors Logo), ప్రపంచ కప్ ప్రమోషన్ ఈవెంట్స్ను బాయ్కాట్ చేయనున్నారట. కాంట్రాక్ట్ వివాదమే అందుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
f’మేము పాకిస్థాన్ తరఫున ఉచితంగా ఆడుతాం. మా ప్రశ్న ఏంటంటే.. పీసీబీతో ఒప్పంద కుదుర్చుకున్న స్పాన్సర్ల లోగోను మేము ఎందుకు ప్రమోట్ చేయాలి. అదే కాకుండా ప్రపంచ కప్ ప్రమోషన్స్, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాం’ అని పాక్ ఓ క్రికెటర్ తెలిపాడు.
సెంట్రల్ కాంట్రాక్టులో భాగంగా కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam), మహ్మద్ రిజ్వాన్(Rizwan), షాహీన్ ఆఫ్రీదీ(Shaheen Afridi)లకు నెలకు రూ.13.22 లక్షలు ముట్టాయనే వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అదే టెస్టు ఆటగాళ్లకు నెలకు రూ.3.2 లక్షలు మాత్రమే ముట్టయని, వన్డే క్రికెటర్లకు రూ. 2.8లక్షలు ఇచ్చారని కథనాలు రాశారు. అయితే.. పాక్ స్టార్ ఆటగాళ్లు, పీసీబీ ఇంకా సెంట్రల్ కాంట్రాక్ట్పై సంతకాలు కూడా పెట్టలేదు. దాంతో, పాక్ ఆటగాళ్లు స్పాన్సర్లు, ప్రపంచ కప్ ప్రమోషన్స్కు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.
మరో విషయం ఏంటంటే.. పాక్ క్రికెటర్లు ఐసీసీ(ICC), స్పాన్సర్ల నుంచి వచ్చిన ఆదాయాన్ని పీసీబీతో పంచుకోవాలనే నియయం ఉంది. ఈ నిబంధన కూడా వివాదానికి ఓ కారణం అని తెలుస్తోంది. ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series)లు, స్పాన్సర్ల ద్వారా రూ.8 లక్షల కోట్లు సమకూరనుంది.
ఆక్టోబర్ 5న ప్రపంచ కప్ పోటీలు మొదలవ్వనున్నాయి. భారత్, పాకిస్థాన్ అక్టోబర్ 14న అహ్మదాబాద్లో తలపడనున్నాయి. ఈ మధ్యే ముగిసిన ఆసియా కప్లో టీమిండియా చేతిలో బాబర్ సేన చావు దెబ్బ తిన్నది. పైగా వరల్డ్ కప్లో పాక్కు భారత్పై రికార్డు ఏమంత గొప్పగా లేదు. దాంతో, ఈసారి దాయాది జట్ల పోరులో ఎవరు పై చేయి సాధిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.