న్యూఢిల్లీ: భారత సెయిలర్లు అర్జున్ జాట్, అరవింద్ సింగ్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నారు. టోక్యో వేదికగా శుక్రవారం జరిగిన ఆసియా ఓషియానా కాంటినెంటల్ రెగట్టా టోర్నీ పురుషుల డబుల్స్ స్కల్స్ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన అర్జున్, అరవింద్ ద్వయం విశ్వక్రీడలకు అర్హత సాధించింది. కాగా భారత్ తరఫున ఇప్పటికే ఒలింపిక్స్కు అర్హత సాధించిన సెయిలర్లు నేత్ర కుమారన్, విష్ణు శరవణన్, కేసీ గణపతి, వరుణ్ తక్కర్ యూరప్లో శిక్షణ తీసుకునేందుకు టాప్స్ కింద కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ రూ.73.14 లక్షలు కేటాయించింది.