హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఆల్ ఇండియా ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి పి. రాజ్కుమార్ విజేతగా నిలిచాడు. నాగ్పూర్లో జరిగిన టోర్నీలో మొత్తం తొమ్మిది రౌండ్లలో అత్యధికంగా 8.5 పాయింట్లు సాధించి ట్రోఫీ నెగ్గాడు.
ఈ టోర్నీలో రాజ్కుమార్ ఒక్క గేమ్ కూడా ఓడకుండా అజేయంగా నిలిచి ట్రోఫీతో పాటు రూ.50 వేల నగదు బహుమతిని సొంతం చేసుకున్నాడు.