లక్నో : ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం మరోమారు వార్తల్లో నిలిచింది. మణిపూర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ 2003లో వీరమరణం పొందిన శౌర్యచక్ర అవార్డు గ్రహీత వివేక్ సక్సేనా తల్లి సావిత్రి సక్సేనా(80) ప్రభుత్వం ఇస్తామన్న భూమి హామీ నెరవేరకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమారునికి అందించిన పతకాలు, నగదు పురస్కారాలు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
వివేక్ మృతి చెందాక తమ కుటుంబానికి ప్రభుత్వం హామీ ఇచ్చిన భూమి, ఇతర ప్రయోజనాల కోసం ఏండ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగిపోయానని ఆమె ఆవేద న వ్యక్తం చేశారు. లక్నోలో ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఆమె ఈ వివరాలు తెలిపారు. ఆమె ఫిర్యాదును వారంలోగా పరిష్కరించాలని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ అధికారులను ఆదేశించారు.