హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పికిల్ బాల్ చాంపియన్షిప్లో మహారాష్ట్ర టీమ్ ఓవరాల్ చాంప్గా నిలిచింది. తెలంగాణ పికిల్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 18 రాష్ర్టాల క్రీడాకారులు పాల్గొనగా.. అండర్-14, -19, -19 ప్లస్, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో మహారాష్ట్ర క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. తెలంగాణకు చెందిన సరయూ ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ది టోర్నీ’ అవార్డు దక్కించుకుంది. ఆదివారం జరిగిన ముగింపు వేడుకల్లో అమెచ్యూర్ తెలంగాణ పికిల్ బాల్ సంఘం అధ్యక్షుడు రావుల శ్రీధర్ రెడ్డి, బేవెరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేశ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పికిల్ బాల్ ఆటను తెలంగాణకు పరిచయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు.