సెంచూరియన్: దక్షిణాఫ్రికా మాజీ పారాఒలింపియన్ ఆస్కార్ పిస్టోరియస్ జైలు నుంచి రిలీజయ్యాడు. గర్ల్ఫ్రెండ్ రీవా స్టీన్కెంప్ను మర్డర్ చేసిన కేసులో అతను 11 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాడు. పెరోల్పై అతన్ని రిలీజ్ చేశారు. 2013లో గర్ల్ఫ్రెండ్ను తుపాకీతో కాల్చి చంపాడు. బత్రూమ్ డోర్ నుంచి ఆమెను షూట్ చేశాడు. దొంత అనుకుని షూట్ చేసినట్లు అతను కోర్టులో తెలిపాడు. ప్రస్తుతం పిస్టోరియస్ వయసు 37 ఏళ్లు. 2015లో అతను దోషిగా తేలాడు. పిస్టోరియస్ శిక్షాకాలం 2029లో ముగియనున్నది.
దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం శిక్షా కాలంలో సగం ముగిసిన తర్వాత ఎవరైనా పెరోల్కు దరఖాస్తు చేసుకోవచ్చు. 2014 అక్టోబర్ నుంచి పిస్టోరియస్ జైలులో ఉంటున్నాడు. పుట్టిన ఏడాదికే అతని కాలును తీసివేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి అతను ప్రోస్థటిక్స్ కాలుపై ఉంటున్నాడు. ఆ తర్వాత ప్రపంచ
ప్రఖ్యాత రన్నరగా పేరుతెచ్చుకున్నాడు. అతన్ని బ్లేడ్ రన్నర్ అని పిలిచేవాళ్లు.
ట్రాక్ ఈవెంట్లలో అతని కెరీర్ సక్సెస్ఫుల్గా సాగింది. పారాఒలింపిక్స్లో అతను చాలా వరకు గోల్డ్ మెడల్స్ సాధించాడు. పెరోల్పై ఉన్న పిస్టోరియస్.. రోజులో కొన్ని గంటలు ఇంట్లోనే ఉండాలి. మద్యం సేవించరాదు. మీడియాతో మాట్లాడేందుకు కూడా అతనికి అనుమతి లేదు.