లండన్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటకు మరోసారి వరుణుడు అడ్డు తగిలాడు. వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా వేసిన విషయం తెలిసిందే. అయితే 18.4 ఓవర్ల ఆట అయిన తర్వాత మరోసారి వర్షం పడటంతో ఆట నిలిపేశారు. ఆ సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ (10), రోహిత్ శర్మ (35) టీమ్కు మంచి ఆరంభం ఇచ్చారు. ఆచితూచి ఆడుతూ.. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. వాతావరణం మేఘావృతమై పేస్ బౌలర్లకు అనుకూలిస్తున్నా.. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు.