AUSvsPAk 1st Test: వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను టెస్టులలో వారి స్వదేశంలో ఓడించాలంటే అది భారత్తోనే సాధ్యమవుతుందని అంటున్నాడు ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్. పాకిస్తాన్ – ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి మ్యాచ్లో పాక్ జట్టు.. 471 పరుగుల ఛేదనలో 89 రన్స్కే నిష్క్రమించడంతో షాన్ మసూద్ అండ్ కో. కు 360 పరుగుల భారీ తేడాతో ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో వాన్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కంగారూలను సొంతగడ్డపై కంగారెత్తించాలంటే అది భారత్కే సాధ్యమని ట్వీట్ చేశాడు.
తొలి టెస్టు ముగిసిన తర్వాత వాన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు అన్ని పరిస్థితుల్లోనూ మెరుగ్గా రాణించగలరు. 500 వికెట్ల క్లబ్లో చేరినందుకు నాథన్ లియాన్కు శుభాకాంక్షలు. ప్రస్తుత పరిస్థితులలో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించాలంటే అది భారత్కు మాత్రమే సాధ్యమవుతుంది…’అని రాసుకొచ్చాడు. వాన్ చెప్పినట్టుగా గడిచిన ఆరేడేండ్లలో ఆస్ట్రేలియాకు వారి స్వదేశంలో చుక్కలు చూపించడమే గాక వరుసగా రెండుసార్లు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని దక్కించుకున్న జట్టు భారత్.
Aussies are so clinical .. they have everything covered for all conditions .. Well done to @NathLyon421 on 500 Test wickets .. Incredible achievement .. Only @BCCI have the tools to compete here in Oz at this stage .. #AUSvsPAK
— Michael Vaughan (@MichaelVaughan) December 17, 2023
2018-19లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్.. నాలుగు టెస్టులు ఆడి 2-1 తేడాతో ఆసీస్ను ఓడించింది. 2020-21 లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. 2018 నుంచి ఆస్ట్రేలియాలో 8 టెస్టులు ఆడిన భారత్.. రెండు మ్యాచ్లలో మాత్రమే ఓడి నాలుగు గెలిచింది. రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ఇతర జట్లపై 27 టెస్టులు ఆడి ఏకంగా 24 మ్యాచ్లలోనూ గెలవడం గమనార్హం. ఇక పాకిస్తాన్ అయితే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించి 28 సంవత్సరాలైంది. చివరిసారిగా పాకిస్తాన్.. ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో 1995లో ఓడించింది. 1995 నుంచి పాకిస్తాన్కు వరుసగా ఇది (పెర్త్ టెస్ట్ ఓటమి) 15వ పరాభవం కావడం గమనార్హం.