ఒమన్: అనూహ్య ఫలితంతో పొట్టి ప్రపంచకప్ ప్రారంభమైంది. ఫేవరెట్గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ను మట్టికరిపించిన స్కాట్లాండ్ మెగాటోర్నీలో ఎలాంటి ఫలితాలైనా సాధ్యమే అని నిరూపించింది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో స్కాట్లాండ్ 6 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై గెలుపొందింది. మొదట స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. క్రిస్ గ్రేవ్స్ (28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్స్కోరర్. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 3.. షకీబ్, ముస్తఫిజుర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లా తీవ్రంగా ఇబ్బంది పడింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. ముష్ఫికర్ రహీమ్ (38) కాస్త పోరాడగా.. లిటన్ దాస్ (5), సౌమ్య సర్కార్ (5) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. షకీబ్ (20), మహ్ముదుల్లా (23)కు మెరుగైన ఆరంభాలు లభించిన పెద్ద స్కోరు చేయలేకపోయారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ వీల్ మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ గ్రేవ్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అంతకుముందు పపువా న్యూగినియాతో జరిగిన పోరులో ఒమన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత సంతతి ఆటగాడు జతిందర్ సింగ్ (73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒమన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
1 . అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా షకీబ్ (108)రికార్డుల్లోకెక్కాడు. స్కాట్లాండ్తో మ్యాచ్లో మలింగ (107)ను దాటేశాడు.