న్యూఢిల్లీ: ఒలింపిక్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఓ మర్డర్ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆయన ఢిల్లీలోని రోహిణి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఢిల్లీలోని చత్రాసాల్ స్టేడియం వద్ద 23 ఏళ్ల సాగర్ రాణాను హత్య చేసిన కేసులో సుశీల్ అరెస్టు అయ్యాడు. మే 23వ తేదీన ఢిల్లీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ పన్నాగం ప్రకారం సాగర్ రాణా హత్య జరిగిన విషయం తెలిసిందే.