కౌలాలంపూర్: ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు(PV Sindhu) మళ్లీ ఫామ్లోకి వచ్చేసింది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్లో స్కాట్ల్యాండ్కు చెందిన కిస్టీ గిల్మోర్పై వరుస సెట్లలో విజయం సాధించింది. వరల్డ్ నెంబర్ 15వ ర్యాంక్లో ఉన్న సింధు.. ఇటీవల జరిగిన ఉబర్ కప్, థాయిలాండ్ ఓపెన్ టోర్నీలను మిస్సైంది. అయితే మలేషియా మాస్టర్స్ ఫస్ట్ రౌండ్లో 21-17, 21-16 గేమ్లతో 22వ ర్యాంక్ గిల్మోర్ను ఓడించింది. కేవలం 46 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించేసింది. రెండో రౌండ్లో కొరియాకు చెందిన సిమ్ యు జిన్తో తలపడనున్నది.