TATA Mumbai Marathan : ముంబైలో వచ్చే ఆదివారం 19వ మారథాన్ పోటీలు జరుగునున్నాయి. ఈ పోటీలకు మరింత ప్రచారం తీసుకురావడం కోసం నిర్వాహకులు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కటీ మూన్(Katie Moon)ను అంబాసిడర్గా నియమించారు. దాంతో, రెండు సార్లు వరల్డ్ చాంపియన్(World Champion) అయిన మూన్ టాటా ముంబై మారథాన్కు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. డిసెంబర్ 31వ తేదీన ఈ పోటీలు జరుగనున్నాయి.
‘జీవితం అనే పరుగు పందెంలో ప్రతి అడుగు కొందరిలో స్ఫూర్తి నింపేందుకు, మార్పు తెచ్చేందుకు దొరికిన ఒక అవకాశం. టాటా ముంబై మారథాన్ 2024 పోటీలకు అంబాసిడర్గా ఎంపికైనందుకు చాలా సంతోషిస్తున్నా. అంతేకాదు ఈ మారథాన్లో పాల్గొనే వందలాది మందిని ఇన్స్పైర్ చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని 32 ఏండ్ల మూన్ తెలిపింది. అమెరికాకు చెందిన మూన్ 2023 బుడాపెస్ట్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో బంగారు పతకం సాధించింది.
Get ready for a 𝘔𝘖𝘖𝘕-lit #TMM2024 🤩
Put your hands together for the two-time World Champion, 2020 Tokyo Olympics Gold Medallist, and our International Event Ambassador @ktnago13 🔥#HarDilMumbai | @procamintl pic.twitter.com/uLSw9RJX1x
— Tata Mumbai Marathon (@TataMumMarathon) December 27, 2023
జనవరి 21వ తేదీన టాటా ముంబై 19వ మారథాన్ మొదలవ్వనుంది. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన 10 మారథాన్లలో ఒకటైన ఈ పరుగు పందెంలో విదేశీయులు సైతం పాల్గొననున్నారు. ఈ మారథాన్లో 42 కిలోమీటర్ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొనాలంటే టాటా ముంబై మారథాన్ వెబ్సైట్లో ముందుగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.