క్రికెట్ కామెంట్రీ గురించి టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ దోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ కామెంట్రి అనేది ఒ కళ అని అన్నాడు. కామెంటేటర్గా చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలన్నాడు. క్రికెట్ గురించి అందులో నెంబర్స్ గురించి పూర్తిగా తెలుసుండాలి సమయానికి అన్నీ గుర్తుండాలి. ఎంతో చమత్కారంగా, ప్రెక్షలను ఆకట్టుకునే విధంగా లైవ్ కామెంట్రీ చెప్పడం చాలా కష్టం. అది అందరికీ సాధ్యం కాదన్నారు. మొబైల్ ఫోన్లోనే ఇతరులతో మాట్లాడాలంటే నేను ఎంతో ఇబ్బంది పడతాను అలాంటిది కామెంట్రీ చెప్పడమా?.. అది మనవల్ల కాని పనిలే అని కామెంట్రీ గురించి అన్నాడు.
క్రికెట్ మ్యాచ్ లైవ్లో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా కామెంట్రీని ఎంతో ఆసక్తికరంగా చెప్పడం ఓ కళ అని ధోని పేర్కొన్నాడు. ప్లేయర్స్ భారీ షాట్స్ కొట్టినపుడు, గెలుపోటములు విశ్లేషించేటపుడు ఎవరూ నొచ్చుకోకుండా రన్నింగ్ కామెంట్రీ చెప్పడం చాలా కష్టమని, క్రికెట్ ప్లేయర్స్ అందరీ రికార్డ్స్ మొదలు కొని పాత మ్యచ్ల గణంకాలు గుర్తు పెట్టుకోవాలి. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. నా గణకాంలే నాకు గుర్తుకుండవు. అని ధోని అన్నాడు.