ODI World Cup | ప్రపంచకప్ కోసం భారత జట్టులో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. అక్షర్పటేల్ గాయపడ్డ విషయం తెలిసిందే. అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ను 15 మంది సభ్యుల జట్టులో చేర్చారు. ఆసియా కప్ సందర్భంగా అక్షర్ గాయపడ్డాడు. తాజాగా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో ఆడే అవకాశం అశ్విన్కు దక్కింది. అయితే, టీమ్లో మార్పులను ఐసీసీ ధ్రువీకరించింది. అశ్విన్ ఇంగ్లండ్తో ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్కు ముందు భారత జట్టుతో కలిసి గౌహతికి చేరుకున్నాడు.
అయితే, అక్షర్ ఫిట్గా లేడని భావించి.. తొలుత అశ్విన్ వరల్డ్ కప్ జట్టులో చేర్చారు. జట్టులో మార్పులు చేసేందుకు గురువారం చివరి రోజుకావడంతో టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో అశ్విన్ రెండు మ్యాచ్ల్లో నాలుగు వికెట్లు పడగొట్టి సెలక్టర్లను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇండోర్లోని ఫ్లాట్ పిచ్పై అశ్విన్ బౌలింగ్ కారణంగా టీమిండియా విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో ఇండోర్ వన్డేలో అశ్విన్ 41 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హర్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్.