ODI World Cup | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో భాగంగా.. దక్షిణాఫ్రికా, శ్రీలంక పోరులో లెక్కకు మిక్కిలి రికార్డులు బద్దలయ్యాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కాగా.. ఈ క్రమంలో సఫారీ జట్టుకు చెందిన ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కారు. వరల్డ్కప్లో ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్లో శతకాలు సాధించడం కూడా ఇదే తొలిసారి. ఇక ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ 49 బంతుల్లో మూడంకెల స్కోరు చేసి వరల్డ్కప్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్గా చరిత్రకెక్కాడు.
ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ డెర్ డసన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాలు బాదారు. ఇలా ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్లో సెంచరీలు చేయడం విశ్వసమరంలో ఇదే తొలిసారి కావడం విశేషం.
428/5 శ్రీలంకపై దక్షిణాఫ్రికా 2023 ఢిల్లీలో
417/6 అఫ్గానిస్థాన్పై ఆస్ట్రేలియా 2015 పెర్త్లో
413/5 బెర్ముడాపై భారత్ 2007 పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో
411/4 ఐర్లాండ్పై దక్షిణాఫ్రికా 2015 కాన్బెర్రాలో
408/5 వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా 2015 సిడ్నీలో
439/2 వెస్టిండీస్పై 2015లో
438/9 ఆస్ట్రేలియాపై 2006లో
438/4 భారత్పై 2015లో
428/5 శ్రీలంకపై 2023లో
1-శ్రీలంకపై ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు (428/5) కూడా ఇదే. 2009లో రాజ్కోట్ వేదికగా జరిగిన వన్డేలో భారత జట్టు లంకపై 414/7 చేసిన స్కోరు రెండో స్థానానికి చేరింది.