లక్నో: వన్డే ప్రపంచక్ప్-2023లో భాగంగా ఆదివారం భారత్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో బౌలర్ బంతి విసురుతుండగానే ఫీల్డ్లో ఉన్న ఈ ఇద్దరి మధ్య ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్ కొట్టిన బంతి తనవైపే రావడంతో రోహిత్ దాన్ని అందుకుని బౌలర్కు విసిరాడు.
మరి కుల్దీప్ యాదవ్పై రోహిత్ శర్మ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందంటే 22వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ విసిరిన బంతిని ఇంగ్లండ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించగా అది బ్యాట్కు కాకుండా అతని ప్యాడ్కు తగిలింది. కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేసినా డీఆర్ఎస్కు వెళ్దామని కెప్టెన్ రోహిత్ శర్మకు కాన్ఫిడెంట్గా చెప్పలేదు. కానీ, రిప్లేలో బంతి నేరుగా వికెట్ల మీదకు వెళ్లినట్లు తేలింది.
ఇండియా డీఆర్ఎస్ తీసుకుని ఉంటే లివింగ్ స్టోన్ పెవిలియన్ బాటపట్టేవాడు. అందుకే బిగ్ స్క్రీన్పై రిప్లే చూసిన వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా తన పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ వైపు వచ్చాడు. డీఆర్ఎస్ తీసుకుందామని ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో తనవైపు బంతి రావడంతో పరుగెత్తి దాన్ని అందుకుని బౌలర్కు చేరవేశాడు. ఈ సమయంలో కుల్దీప్ యాదవ్ మొహం మాడ్చుకున్నట్లు వీడియోలో కనిపించింది.
ఈ ఘటన జరిగిన సమయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాల్సింది తెలుసా..? అతను జట్టు కెప్టెన్. టీమ్ను ముందుండి నడిపిస్తున్నాడు’ అని కుల్దీప్ యాదవ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
— Nihari Korma (@NihariVsKorma) October 30, 2023