SL vs PAK | వన్డే వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్ బ్యాటర్లు చెమటోడుస్తున్నారు. 40 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేశారు. టార్గెట్ చేధించేందుకు క్రీజులోకి వచ్చిన పాక్కు శ్రీలంక ఆదిలోనే షాకిచ్చింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 12)ను తక్కువ పరుగులకే పెవిలియన్కు పంపింది. ఆ వెంటనే కెప్టెన్ బాబర్ ఆజామ్ (10)ను కూడా స్వల్ప స్కోర్కే ఔట్ చేసింది. కానీ మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (113) హాఫ్ సెంచరీతో మెరిశాడు. మహ్మాద్ రిజ్వాన్ (97) కూడా సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. రిజ్వాన్, సౌద్ షకీల్ (18) క్రీజులో ఉన్నారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను ఆదిలోనే దెబ్బకొట్టాలని పాక్ ప్రయత్నించింది. కానీ శ్రీలంక బ్యాటర్లు దుమ్ముదులిపారు. ఓపెనర్ కుశాల్ పెరీరాను పాక్ పేసర్ హసన్ డకౌట్ చేసి ఆరంభంలోనే దెబ్బకొట్టాలని ప్రయత్నించినప్పటికీ చెలరేగి ఆడారు. మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక (51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతనితో జోడీ కట్టిన కుశాల్ మెండీస్ (122 ) కూడా పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. సమరవిక్రమ కూడా 89 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు. ఫలితంగా మిగిలిన ప్లేయర్లు అంతా తొందరగానే పెవిలియన్కు చేరినప్పటికీ.. శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.