వెల్లింగ్టన్ : సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో న్యూజిలాండ్ మహిళల జట్టు అదరగొట్టింది. ఇరుజట్ల మధ్య బేసిన్ రిజర్వ్ (వెల్లింగ్టన్) వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య జట్టు.. 347 పరుగుల రికార్డు ఛేదనను విజయవంతంగా పూర్తిచేసి మహిళల క్రికెట్లో అత్యధిక ఛేదన చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. సఫారీలు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కివీస్ మరో రెండు బంతులు మిగిలుండగానే 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది.
కెప్టెన్ అమెలియా కెర్ (139 బంతుల్లో 179 నాటౌట్, 23 ఫోర్లు, 1 సిక్స్) అజేయ భారీ శతకానికి తోడు వికెట్కీపర్ బ్యాటర్ ఇసాబెల్లా (68) రాణించడంతో ఆ జట్టు.. వన్డేల్లో టీమ్ఇండియా పేరిట ఉన్న రికార్డు (ఆస్ట్రేలియాపై 341)ను చెరిపేసింది. 130 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కెర్, ఇసాబెల్లా ఐదో వికెట్కు 120 రన్స్ జోడించి ఆ జట్టును విజయపథాన నిలిపారు.