షార్జా: పసికూన నమీబియాపై కివీస్ బ్యాట్స్మెన్ చెలరేగి ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిల్యాండ్ జట్టును నమీబియా బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (18), డారియల్ మిచెల్ (19) స్వల్ప వ్యవధిలోనే అవుటవడంతో ఆ జట్టు డిఫెన్స్లో పడింది.
ఇలాంటి సమయంలో మరో వికెట్ పడకుండా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (28), డెవాన్ కాన్వే (17) ఆచితూచి ఆడారు. అయితే విలియమ్సన్ను నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కాన్వే రనౌటయ్యాడు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (39 నాటౌట్), జేమ్స్ నీషమ్ (35 నాటౌట్) విజృంభించడంతో కివీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు మగిసే సరికి న్యూజిల్యాండ్ జట్టు 163/4 స్కోరు చేసింది. నమీబియా బౌలర్లలో ఎరాస్మస్, డేవిడ్ వీజే, ష్కాల్జ్ తలో వికెట్ పడగొట్టారు.