అబుధాబి: టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. న్యూజిల్యాండ్తో పోరులో ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ రాణిస్తున్నారు. గాయం కారణంగా స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ దూరమవడంతో జానీ బెయిర్స్టో(13)ను బట్లర్(19 నాటౌట్)కు జోడీగా పంపారు.
వీరిద్దరూ కివీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. రెండు ఎండ్ల నుంచి సౌథీ, బౌల్ట్ వేసే బంతుల్లో చెత్తవాటిని బౌండరీలుగా మలుస్తూ చక్కగా ఆడారు. అయితే ఆరో ఓవర్లో బంతి అందుకున్న ఆడమ్ మిల్నే తొలి బంతికే ఇంగ్లండ్ను దెబ్బతీశాడు.
అతని బౌలింగ్లో కివీస్ సారధి కేన్ విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చిన బెయిర్స్టో పెవలియన్ చేరాడు. దీంతో డేవిడ్ మలన్ క్రీజులోకి వచ్చాడు. తొలి పవర్ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ జట్టు వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది.