WTC Standings | అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే భారత్ – ఇంగ్లండ్లు టెస్టు క్రికెట్ ఆడుతుండగా రేపటి (ఫిబ్రవరి 29) నుంచి మరో రెండు అగ్రశ్రేణి జట్లు రెడ్బాల్ క్రికెట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా.. రేపట్నుంచి వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు ఆడబోతుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రేపు తొలి టెస్టు మొదలవనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్లో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్ ప్రభావం భారత్పై పడుతుందా..? కివీస్, ఆస్ట్రేలియాల గెలుపోటములు భారత్పై ప్రభావం చూపుతాయా..? ఎవరు గెలిస్తే మనకు లాభం..?
పాయింట్ల పట్టిక ఇలా..
ఇంగ్లండ్తో రాంచీ టెస్టులో గెలిచిన తర్వాత డబ్ల్యూటీసీ స్టాండింగ్స్లో భారత్.. 64.58 పర్సంటేజ్తో రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్.. 75 శాతంతో అగ్రస్థానంలో ఉండగా 55 శాతంతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. రాబోయే రెండు వారాల్లో తొలి మూడు స్థానాలలో మార్పులు జరిగే అవకాశం మెండుగా ఉంది.
భారత్పై ప్రభావం..
ఫిబ్రవరి 29 నుంచి మొదలుకాబోయే తొలి టెస్టులో ఆస్ట్రేలియా గెలిస్తే ఆ జట్టు మూడో స్థానంలోనే ఉంటుంది. ఫస్ట్ టెస్టు గెలిచినా ఆ జట్టు 60 పర్సంటేజ్తో థర్డ్ ప్లేస్లోనే ఉండనుంది. కానీ న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం ఆ జట్టు 80 శాతంతో అగ్రస్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటుంది. ఆస్ట్రేలియా 50 శాతానికి పడిపోయి థర్డ్ ప్లేస్లోనే కొనసాగుతుంది.
The Tegel Test Series starts tomorrow in Wellington! 🏆 The teams will also be competing for the Trans-Tasman Trophy, with Australia the current holders. #NZvAUS pic.twitter.com/hGti5tzrjM
— BLACKCAPS (@BLACKCAPS) February 28, 2024
ఒకవేళ ఆస్ట్రేలియా 2-0 తేడాతో ఈ సిరీస్ గెలుచుకుంటే అప్పుడు ఆ జట్టు 62.5 శాతంతో రెండో స్థానంలోకి వెళ్తుంది. న్యూజిలాండ్ 50 పర్సంటేజ్తో మూడో స్థానానికి పడిపోతుంది. అప్పుడు భారత్.. అగ్రస్థానాన్ని దక్కించుకుంటుంది. అదీగాక ధర్మశాలలో ఇంగ్లండ్తో జరుగబోయే ఆఖరి టెస్టులో గనక భారత్ విజయం సాధిస్తే భారత్ విన్నింగ్ పర్సంటేజ్ 68.51కు చేరుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు రెండు, మూడు స్థానాల్లో ఉంటాయి.
అలా కాకుండా ఈ సిరీస్లో న్యూజిలాండ్ గనక 2-0తో గెలిస్తే అప్పుడు కివీస్.. 83.33 పర్సంటేజ్తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసి భారత్, ఇంగ్లండ్ను ఓడిస్తే.. 68.51 పర్సంటేజ్తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఏదెలాఉన్నా రాబోయే రెండు మూడు వారాల్లో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు అయితే పక్కా…