అబుధాబి: ఆఫ్ఘనిస్థాన్పై కివీస్ 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్-2 నుంచి సెమీస్ చేరే రెండు జట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే నాలుగు విజయాలతో పాకిస్థాన్ సెమీస్ చేరింది. రెండో స్థానం కోసం న్యూజిల్యాండ్, భారత్, ఆఫ్ఘన్ జట్లు పోటీలో ఉన్నాయి. ఆఫ్ఘన్ను ఓడించిన కివీస్ ఈ బెర్తు దక్కించుకుంది.
125 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిల్యాండ్కు మార్టిన్ గప్తిల్ (28), డారియల్ మిచెల్ (17) శుభారంభం అందించారు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ (40 నాటౌట్), డెవాన్ కాన్వే (36 నాటౌట్) ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ చెరో వికెట్ కూల్చారు.
ఈ విజయంతో సెమీస్ చేరాలనే టీమిండియా ఆశలు కూడా ఆవిరయ్యాయి. సోమవారం జరిగే నామమాత్రపు మ్యాచ్లో నమీబియాతో టీమిండియా తలపడనుంది.