Manju Rani : మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల ముందు భారత బాక్సింగ్ సమాఖ్యకు (బీఎఫ్ఐ) మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. లిస్టులో తమ పేరు లేకపోవడం పట్ల కొందరు బాక్సర్లు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంజూ రాణి భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్కు లెటర్ రాసింది. 48 కేజీల విభాగంలో నేషనల్ ఛాంపియన్ అయిన తనను ఎంపిక చేయకపోవడం పట్ల ఆమె అసంతృప్తిని వెళ్లగక్కింది. తన బదులు నితూ ఘంఘాస్ను తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను సెలెక్ట్ చేయకుంటే కోర్టకు వెళ్తానంటూ ఆమె హెచ్చరించింది.
‘నేను 48 కేజీల విభాగంలో నేషనల్ ఛాంపియన్ను. అయితే.. వరల్డ్ ఛాంపియన్ష్స్కి ముందు నంబర్ 1 ర్యాంకు నుంచి నంబర్ 2కు పడిపోయాను. దాంతో. నా స్థానంలో నీతూను ఎంపిక చేశారు. ఆమె నంబర్ 3 బాక్సర్. ఆమెను భారత జట్టులోకి తీసుకుంటే నన్ను పక్కన పెట్టాల్సి వస్తుంది’ అని మంజూ రాణి తన లేఖలో రాసుకొచ్చింది.
2019లో వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో మంజూ వెండి పతకం గెలిచింది. అయితే.. బర్మింగ్హమ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో నీతూ విజేతగా నిలిచింది. దాంతో, బాక్సింగ్ సమాఖ్య నీతూ వైపు మొగ్గు చూపింది. మార్చి 15న ఢిల్లీలో మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది.