కోల్కతా : గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో బ్యాటర్ నితీష్ రాణాను కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా నియమించారు. ఈ మేరకు కేకేఆర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ వెన్ను నొప్పినుంచి కోలుకుంటున్న శ్రేయస్ ఇప్పట్లో క్రికెట్ ఆడే పరిస్థితి లేనందున నితీష్ రాణాను ప్రస్తుత సీజన్కు కెప్టెన్గా నియమిస్తున్నట్టు తెలిపింది.
2018నుంచి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తునన నితీష్ రాణాకు రాష్ట్ర జట్టుకు పరిమిత ఓవర్ల మ్యాచ్లలో నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉందని జట్టు యాజమాన్యం తెలిపింది. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి 12 టి20 మ్యాచ్లలో నేతృత్వం వహించిన నితీష్ రాణా ఎనిమిది మ్యాచ్లలో విజయాలు అందించాడు.