చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీశ్రానాపై జరిమానా పడింది. శనివారం చెన్నైతో మ్యాచ్ సందర్భంగా ఫోర్త్ అంపైర్తో జరిగిన వాగ్వాదం విషయంలో రానా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఐపీఎల్ ప్రవర్తనా నియామవళి ప్రకారం లెవల్-1 తప్పిదం కింద జరిమానాకు తోడు రానాపై ఒక డీమెరిట్ పాయింట్ విధించినట్లు స్పష్టం చేసింది. స్టబ్స్ తడిగా ఉన్న తన గ్లవ్స్ మార్చుకునేందుకు అంపైర్లు అవకాశం ఇవ్వకపోవడం దీనికి కారణమైంది.