Nisha Dahiya | జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ప్రముఖ రెజ్లర్ నిషా దహియా అద్భుతమైన ముగింపు లభించింది. ఫైనల్లో పంజాబ్కు చెందిన జస్ప్రీత్ కౌర్పై ఆమె సునాయాసంగా విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు సరిగ్గా ఒకరోజు ముందు ఆమెను ఒక వ్యక్తి తుపాకీతో షూట్ చేసి చంపేశాడంటూ ఒక వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది.
ఈ క్రమంలో తాను బతికే ఉన్నానంటూ నిషా స్వయంగా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తీరా చూస్తే మరణించిన అమ్మాయి పేరు కూడా నిషా దహియానే కావడంతో అందరూ ఈ రెజ్లర్ మరణించిందని అనుకున్నట్లు తేలింది. మరణించిన నిషా కూడా రెజ్లింగ్ క్రీడాకారిణే కావడమే ఈ పొరపాటుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈ గొడవ కారణంగా రాత్రిపూట సరిగా నిద్ర కూడా పోలేకపోయానని, చాలా ఒత్తిడికి లోనయ్యానని గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నిషా చెప్పింది. అసలే డైట్ ప్లాన్ మార్చుకొని బరువు తగ్గడంతో ఒత్తిడిలో ఉన్న తనకు ఈ వార్తలు మరింత ఇబ్బంది కలిగించాయని తెలిపింది. అయితే వీటన్నింటినీ పక్కన పెట్టి 65కేజీల విభాగంలో ఆమె జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలవడం అభినందనీయం.