హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ గోల్ఫ్ టోర్నీలో గురుకుల గోల్ఫర్లు సత్తాచాటారు. కర్ణాటక వేదికగా జరిగిన మూడో దశ సౌత్ జోన్-నేషనల్ పోటీల్లో గురుకుల విద్యార్థులు 9 పతకాలు కైవసం చేసుకున్నారు. అందులో ఓ స్వర్ణం, 4 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. తొర్రూర్ పాఠశాలలో చదువుతున్న అమూల్య కేటగిరీ-‘బి’లో పసిడి పతకం చేజిక్కించుకోగా.. అనూష, మధు, ప్రిసిల్లా, జెరుషా రజత పతకాలు కొల్లగొట్టారు. విగ్నేశ్, సాగర్, అఖిల, శృతి కాంస్యాలు కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో మెరిసిన విద్యార్థులను కోచ్ భాస్కర్తో పాటు సత్యనారాయణ, నందిని అభినందించారు.