న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. తనదైన అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఈ ఇందూరు బాక్సర్ అవార్డు కోసం పోటీపడనుంది.
నిఖత్తో పాటు స్టార్ షట్లర్ పీవీ సింధు, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, మీరాబాయి చాను అవార్డుకు నామినేట్ అయ్యారు. ఆయా క్రీడాంశాల్లో ప్లేయర్లను ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ నిర్వాహకులు తుది జాబితాను విడుదల చేయనున్నారు.