న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్లు సత్తాచాటుతారనే నమ్మకం తనకుందని ప్రపంచ చాంపియన్, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. బర్మింగ్హామ్ వేదికగా ఈనెల 28 నుంచి జరుగనున్న ఈ టోర్నీలో దేశం నుంచి కనీసం ఎనిమిది పతకాలు సాధిస్తామని నిఖత్ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘దేశం తరఫున పతకాలు గెలువాలనే ఆకలితో ఉన్నా. తొలిసారి బరిలోకి దిగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో తప్పక మెడల్ సాధిస్తా. బర్మింగ్హామ్ క్రీడల్లో మన బాక్సర్లు కనీసం 4 స్వర్ణాలు సాధిస్తారనే నమ్మకముంది’ అని నిఖత్ పేర్కొంది. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్లు 9 పతకాలు (3 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) సాధించిన విషయం తెలిసిందే. ఈ సారి ఆ సంఖ్యను మరింత పెంచుతామని నిఖత్ చెప్పింది. ఈ మెగాటోర్నీలో తెలంగాణ నుంచి నిఖత్తో పాటు నిజామాబాద్ బాక్సర్ హుసాముద్దీన్ బరిలోకి దిగుతున్నాడు.