ODI World Cup | బంగ్లాదేశ్ తో చెన్నైలో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 21 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 100 పరుగులు చేసింది. సారధి కానే విలియమ్సన్ తో కలిసి జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నిస్తున్న ఓపెనర్ డెవోన్ కాన్వే.. బంగ్లాదేశ్ సారధి షాకిబ్ అలీ హసన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి ఆయన వ్యక్తిగత స్కోర్ 45 పరుగులు. చెన్నై చెపాక్ స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో కివీస్ బ్యాటర్లు సైతం స్కోర్ పెంచడానికి చమటోడుస్తున్నారు. 22 ఓవర్లు పూర్తయ్యే నాటికి రెండు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ 103 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ తొలి పది ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులు చేసింది. డెవాన్ కాన్వేతో కలిసి సారధి కానే విలియమ్స్ సన్ జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. కానే విలియమ్సన్ 10, డెవోన్ కాన్వే 15 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నారు.
అంతకుముందు మూడో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన నాలుగో బంతి.. ఓపెనర్ రచిన్ రవీంద్రా బ్యాట్ ఎడ్జి మీదుగా వికెట్ కీపర్ ముషిఫికర్ రహీం చేతుల్లో పడటంతో రచిన్ రవీంద్రా పెవిలియన్ దారి పట్టాడు. అంతకుముందు రెండు ఫోర్లతో రచిన్ రవీంద్రా మెరుపులు మెరిపించాడు.