Newzealand : సిరీస్లో కీలకమైన మూడో 20కి ముందు న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో టీ 20కి దూరం కానున్నాడు. ముందుగానే డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నందున విలయమ్స్న్ మూడో టీ 20లో ఆడడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది. దాంతో, సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ కెప్టెన్గా జట్టుని నడింపిచనున్నాడు. విలియమ్సన్ ప్లేస్లో ఆక్లాండ్కు చెందిన మార్క్ చాప్మన్ను తీసుకోనున్నారు. నవంబర్ 25వ తేదీ నుంచి మొదలయ్యే వన్డే సిరీస్లో జట్టుతో విలియమ్సన్ చేరనున్నాడు. మంగళవారం నేపియర్లో మూడో టీ 20 జరగనుంది. రెండో టీ 20లో 65 పరుగుల తేడాతో విజయం సాధించి భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది.
రెండో టీ 20లో టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతను 111 పరుగులతో నాటౌట్గా నిలవడంతో భారత్ 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. 192 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ విలియమ్సన్ ఒక్కడే 61 రన్స్తో రాణించాడు. ఈ మ్యాచ్లో టిమ్ సౌథీ హ్యాట్రిక్ సాధించాడు. ఇతను టీ 20ల్లో హ్యాట్రిక్ వికెట్లు తీయడం ఇది రెండోసారి. శ్రీలంక మాజీ క్రికెటర్ మలింగ కూడా టీ 20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు.